ఓటీటీలోకి పొలిటికల్ డ్రామా సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
on May 8, 2024
రెండు తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ డ్రామా నడుస్తోంది. అయితే ఈ తరుణంలో పొలిటికల్ పార్టీలు తమ ప్రత్యర్థులను బలహీన పరిచేందుకు వినూత్నంగా పోటీపడుతుంటారు. అయితే ఇదే తరహాలో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్ రూపొందింది.
భీమిలి కబడ్డీ జట్టు, హ్యాపీ, కాంతారా సినిమాలలో నటించిన కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ " తలైమై సేయలగం". జీ5 వేదికగా తమిళంతో పాటు తెలుగులోను ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ని వాస్తవికతకు దగ్గరగా ఉండేలా నిర్మించారంట. అందుకే ఈ సిరీస్ ని భారీ అంచనాలతో రిలీజ్ చేస్తున్నారు. సలార్ మూవీ ఫేమ్ శ్రియారెడ్డి, కస్తూరి, భరత్, రమ్య నంబీశన్, దర్శన గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాధిక శరత్ కుమార్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు. గిబ్రాన్ మ్యూజిక్ అందించగా..నేషనల్ అవార్డ్ విన్నర్ వసంత బాలన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సిరీస్ మేకర్స్ ఓ కీలక ప్రకటన చేశారు. మే 17 నుండి ఈ సిరీస్ జీ5 లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు.
తమిళనాడులో బిజేపీ అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికలలో భాగంగా రాధిక పోటీ చేస్తోంది. అయితే తమిళనాడులో ఎన్నికల సమయంలో కొంతమంది రాజకీయ పెద్దలు ఆడిన చదరంగాన్ని ఈ సిరీస్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు మేకర్స్. మరికొన్ని రోజుల్లో ఓటీటీలోకి రాబోయే ఈ వెబ్ సిరీస్ ని మిస్ కాకుండా చూసేయ్యండి మరి.
Also Read