ENGLISH | TELUGU  

పవన్ సినిమాకు తాజ్ మహల్... ఛార్మినార్ సెట్స్!

on Jan 30, 2020

ఎటువంటి హంగామా, హుషారు లేకుండా పవన్ కళ్యాణ్ - క్రిష్ సినిమా మొదలైంది. యూనిట్ సభ్యుల మధ్య బుధవారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ హీరోగా 'ఖుషి' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొఘల్స్ పరిపాలించిన సమయంలో సాగే కథతో సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ క్రిష్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశారట. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. 

హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం తాజ్ మహల్... ఛార్మినార్ సెట్స్ వేస్తున్నారట. మెజారిటీ షూటింగ్ ఈ సెట్స్ లో జరుగుతుందట. ఆల్మోస్ట్ ఈ రెండు సెట్స్ కోసం సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. ఏఎం రత్నం ఖర్చు ఏమాత్రం వెనుకాడడం లేదట. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే, ప్రగ్యా జైస్వాల్, సోనాక్షి సిన్హా తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో పాటు 'పింక్' రీమేక్ షూటింగ్ కూడా చేస్తున్నారు పవన్.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.