యూవీ క్రియేషన్స్.. అతనితో మూడోసారి!
on Oct 28, 2021
విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలిచిన సంస్థల్లో యూవీ క్రియేషన్స్ ఒకటి. అలాంటి ఈ సంస్థ పరిచయం చేసిన దర్శకుల్లో సుజీత్ ఒకరు. 2014లో విడుదలైన `రన్ రాజా రన్`(ఇందులో శర్వానంద్ హీరో)తో దర్శకుడిగా తొలి అడుగేసిన సుజీత్.. మొదటి ప్రయత్నంలోనే మెమరబుల్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఆపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో `సాహో` (2019) చేశాడు. పాన్ - ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్.. తెలుగునాట యావరేజ్ గా నిలవగా, హిందీనాట వసూళ్ళ వర్షం కురిపించింది.
కాగా, స్వల్ప విరామం అనంతరం సుజీత్ మరో మారు మెగాఫోన్ పట్టనున్నారు. సుజీత్ తొలి, మలి చిత్రాలు `రన్ రాజా రన్`, `సాహో`ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థనే ఈ సినిమాని కూడా నిర్మించనుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. మరి.. సుజీత్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూడో చిత్రం.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read