భయపెట్టిన జంట మళ్ళీ వస్తోంది
on May 3, 2014
"ప్రేమకథా చిత్రమ్" సినిమాతో నవ్వించి, భయపెట్టిన సుధీర్, నందినీల జంట మరోసారి జోడికట్టనున్నారు. కన్నడలో సూపర్ హిట్టయిన "చార్మినార్" చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారని తెలిసింది. లగడపాటి శ్రీధర్ నిర్మించనున్న ఈ చిత్రంలో ఈ జోడి జతకట్టనున్నారు. కుటుంబకథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించి వీరిద్దరిది హిట్ పెయిర్ అని అనిపించుకుంటారేమో చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. నందిని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం సుమంత్ అశ్విన్ తో కలిసి "లవర్స్" సినిమాలో నటిస్తుంది.