ఫ్లాప్ సినిమా ఐదు వేల స్క్రీన్ లలో..
on Jan 24, 2015
చైనాలో న్యూ ఇయర్ కి శంకర్ ఐ సినిమా అక్కడ విడుదల కానుంది. ఏకంగా ఒకేసారి ఐదు వేల స్క్రీన్ ల మీద ప్రదర్శితం కానుంది. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన 'ఐ' చైనా లో మాత్రం కాస్తంత లేటుగా విడుదల కానుంది. ఈ మేరకు చైనీ ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని తెలుస్తోంది. అక్కడ సెన్సార్ షిప్ కూడా పూర్తయ్యిందని.. ఇక విడుదలే తరువాయి అని సమాచారం.చైనాలో ప్రతి యేటా కేవలం 50 విదేశీ సినిమాలు మాత్రమే విడుదల కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ మేరకే అమనుతులు ఇస్తుంది. విదేశీ సినిమాలు వచ్చి తమ దేశ సినిమా మార్కెట్ ను దెబ్బతీయకుండా అక్కడి నియంతృత్వ కమ్యునిస్టు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకొంటుంది. ఈ 50 సినిమాల్లో హాలీవుడ్ వే ఎక్కువగా ఉంటాయి. అడపాదడపా మాత్రం భారతీయ సినిమాలకు అవకాశం వస్తూ ఉంటుంది.ఇది వరకూ త్రీ ఇడియట్స్, ధూమ్ -3 వంటి సినిమాలు చైనాలో విడుదల అయ్యాయి..పర్వాలేదనిపించుకొనేలా వసూళ్లను సాధించాయి. ఇలాంటి నేపథ్యంలో ఐ కి ఎట్టకేలకూ అవకాశం దక్కింది. సినిమాను కొంత మేర చైనాలో చిత్రీకరించడం తో ఇది స్థానికుల్లో ఆసక్తిని రేకెత్తించగలదని నిర్మాతలు లెక్కలేసుకొంటున్నారు. తక్కువలో తక్కువ అనుకొన్నా ఈ సినిమాకు చైనా వ్యాప్తంగా 20 కోట్ల రూపాయల వరకూ వసూళ్లు దక్కుతాయని ఒక అంచనా.