ప్రముఖ నటి ఝాన్సీ మృతి.. కారణం ఇదే
on Jul 7, 2025

దర్శక దిగ్గజాలు బాపు (Bapu)విశ్వనాధ్(k. Viswanath)తెరకెక్కించిన 'ముత్యాల ముగ్గు', శంకరా భరణం, మనవూరి పాండవులు,పెళ్లి పుస్తకం లాంటి సినిమాలకి తెలుగు చిత్ర పరిశమ్రలో ఎప్పటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమాల్లో కథకి చాలా కీలకమైన పాత్రలని పోషించి ప్రేక్షకులని మెప్పించిన నటి ఝాన్సీ(Jhansi). 1960 వ దశకంలోనే సినీ రంగ ప్రవేశం చేసిన ఝాన్సీ తన కెరీర్ లో సుమారు ఐదు వందల సినిమాల్లో పలు రకాల క్యారెక్టర్స్ ని పోషించింది. భానుమతి, సావిత్రి లాంటి లాంటి మహా నటీమణులకి తల్లిగాను నటించిన ఝాన్సీ కి గయ్యాళి, ఈర్ష్య తో కూడిన పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
రీసెంట్ గా ఝాన్సీ నిన్న విజయవాడ లో తనువు చాలించారు. వయసు పై పడటంతోనే ఆమె చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ ఇలా అందరి హీరోల సినిమాల్లోనూ నటించింది. ఒక్క అక్కినేని నాగేశ్వరరావుతో సుమారు 100 సినిమాల్లోదాకా నటించి ఒక రికార్డు ని కూడా క్రియేట్ చేసిందని చెప్పవచ్చు.
చివరిసారిగా నందమూరి హరికృష్ణ, వైవీఎస్ చౌదరి కాంబోలో వచ్చిన హిట్ మూవీ 'సీతయ్య' లో విలన్ క్యారక్టర్ ముకేశ్ రుషి కి తల్లిగా నటించింది. కృష్ణా జిల్లా గుడివాడ ఆమె స్వస్థలం. సిద్ధి వినాయక పిక్చర్స్ అనే సంస్థని నెలకొల్పి సుమన్, రంభ, మహేశ్వరీ హీరో హీరోయిన్లుగా బి గోపాల్ దర్శకత్వంలో 'ఖైదీ ఇన్స్పెక్టర్' అనే మూవీని నిర్మించిండంతో పాటు కొన్ని చిత్రాలకి ఫైనాన్సియర్ కూడా పని చేసింది. ఆమె మృతి పట్ల తెలుగు చిత్ర నిర్మాత మండలి తో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేసారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



