బాప్ రే అనిపించేలా.. మహేశ్ - సముద్రకని బ్యాంక్ సీన్స్ !
on Sep 18, 2021
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `గీత గోవిందం` వంటి సంచలన విజయం తరువాత పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మెసేజ్ ఓరియెంటెడ్ సోషల్ డ్రామాలో మహేశ్ కి జంటగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
ఇదిలా ఉంటే.. `సర్కారు వారి పాట`లో సముద్రకని ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. `అల వైకుంఠపురములో`, `క్రాక్` తరహాలో ఇందులోనూ ఆయన పాత్ర వైవిధ్యభరితంగా ఉంటుందని బజ్. అంతేకాదు.. బ్యాంక్ సెట్ లో తీసిన మహేశ్ - సముద్రకని కాంబినేషన్ సీన్స్ సినిమాకి మేజర్ హైలైట్ అని ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్. ఈ సన్నివేశాల్లో సముద్రకనిని మహేశ్ ఢీ కొట్టే తీరు బాప్ రే అనిపించేలా ఉంటూ అభిమానులకు గూస్ బంప్స్ తీసుకువస్తాయని అంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే.
కాగా, సంక్రాంతి కానుకగా 2022 జనవరి 13న `సర్కారు వారి పాట` థియేటర్స్ లో సందడి చేయనుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు.
Also Read