సచిన్ తో కలిసి సందడి చేసిన అనుష్క
on Aug 1, 2014
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో కలిసి టాలీవుడ్ బ్యూటీ అనుష్క విజయవాడలో సందడి చేసింది. సౌత్ ఇండియాలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ గా చెప్పబడుతున్న పీవీపీ స్క్వేర్ ను ఈ రోజు ఉదయం సచిన్ ప్రారంభించాడు. దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్స్ లో ఒకటైన పీవీపీ స్క్వేర్ ను సుమారు 125 కోట్లతో ప్రముఖ తెలుగుసినీ నిర్మాత, పారిశ్రామిక వేత్త పీవీపీ ప్రసాద్ నిర్మించారు. ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సచిన్ తో పాటు అనుష్క, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్ కూడా హాజరయ్యారు. సోదరీ సోదరీమణులారా అంటూ తెలుగులో సచిన్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టడం విశేషం. అలాగే సచిన్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అనుష్క తెలిపింది.