'ssmb 28' ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్!
on Feb 24, 2023

'అతడు', 'ఖలేజా' తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'ssmb 28'(వర్కింగ్ టైటిల్). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం నుంచి అదిరిపోయే సర్ ప్రైజ్ రాబోతుందని తెలుస్తోంది.
ఉగాది కానుకగా మార్చి 22న 'ssmb 28' టైటిల్ రివీల్ తో పాటు ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకి 'అయోధ్యలో అర్జునుడు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరి అదే టైటిల్ ని ఖరారు చేశారో లేక వేరే ఏదైనా టైటిల్ పెట్టారో అనేది త్వరలోనే తేలిపోనుంది.
శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్ తన 29వ సినిమాని ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



