నా అన్నయ్య నుంచి ప్రాణహాని ఉందంటూ రోజా ఫిర్యాదు
on Nov 12, 2024
సినీ రంగంలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రోజా(roja)ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎంఎల్ఏ గా, మినిస్టర్ గా కూడా పని చేసిన విషయం తెలిసిందే. కాకపోతే మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయాన్నిఅందుకొని ఇంటికే పరిమితమయ్యింది.
రీసెంట్ గా ఆమె గురించి ప్రముఖ సినీ నటుడు, జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పీ(kirak rp)మాట్లాడుతు నేను రోజా మంత్రిగా ఉన్నపుడు చేసిన అవినీతిని ప్రశ్నిస్తుంటే, కొంత మంది రోజా నాకు జబర్దస్త్ పరంగా చాలా హెల్త్ చేసిందని, నా వ్యాపారానికి కూడా ప్రమోటర్ గా వచ్చిందని, దీంతో నాకు విశ్వాసం లేదని అంటున్నారు. తప్పు ఎవరు చేసినా ప్రశించడం నా నైజం.గతంలో రోజా తన అన్నయ్య రామ్ ప్రసాద్ రెడ్డి తనని డబ్బు కోసం వేధిస్తున్నాడని,ఒక వేళ ఇవ్వకపోతే తనపై అసత్య ఆరోపణలు చేస్తానని బెదిరిస్తున్నాడని, 22 ఏళ్ళ సినీ కెరీర్ లో సంపాదించిందంతా తీసుకొని నన్ను నడి రోడ్ పై ఉంచాడని,చంపుతానని కూడా వార్నింగ్ లు ఇస్తున్నాడని 2013 అక్టోబర్ 6 న రోజా రాయదుర్గం పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ చేసింది.
మరి చిన్నప్పట్నుంచి ఒకే చోట కలిసి పెరిగిన అన్నయ్యే డబ్బులు లాక్కొని చంపుతానని బెదిరిస్తున్నాడని కేసు పెట్టింది.అలా కేసు పెట్టడంలో తప్పు కూడా లేదు. తప్పు ఎక్కడుంటే అక్కడ నిలదీయాలి. మరి నేనేదో జబర్దస్త్ లో కలిసి చేసాం.నా బిజినెస్ ఓపెనింగ్ కూడా వచ్చిందని ఆమె అవితిని ప్రశ్నించకుండా ఉండాలా అని చెప్పుకొచ్చింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
