మేనల్లుడి హీరోయిన్తో చిరంజీవి ఐటమ్ సాంగ్
on Mar 9, 2020

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'ఆచార్య'. ఇందులో ఒక ఐటమ్ సాంగ్ ఉంది. ఆ ఐటమ్ సాంగ్ లో చిరంజీవితో రెజీనా స్టెప్పులు వేశారు. మెగా హీరోలతో రెజీనాకు ఇది మూడో సినిమా అనుకుంట! ఇంతకు ముందు సాయి ధరమ్ తేజ్ సరసన 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమాలో, అల్లు శిరీష్ సరసన 'కొత్త జంట' ఈ సినిమాలోనూ ఆమె నటించారు. ఇంతకు ముందు రెండు సినిమాల్లోనూ మెగాస్టార్ మేనల్లుళ్లతోనే ఆమె నటించడం విశేషం. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేశారు. ఆల్రెడీ ఈ సాంగ్ షూటింగ్ పూర్తయింది. సుమారు వారం రోజులపాటు నైట్ షూట్ చేశారు. మెగాస్టార్ పక్కన స్టెప్పులు వేయడానికి మొదట్లో కొంచెం భయపడ్డాను అని ఆమె అన్నారు.
రెజీనా ఐటమ్ సాంగ్ చేయడం ఇదే తొలిసారి. చిరంజీవి సరసన స్టెప్స్ వేసే అవకాశం రావడంతో మరో ఆలోచన లేకుండా ఎస్ చెప్పానని ఆమె అన్నారు. దీని తర్వాత ఐటెం సాంగ్స్ చేసే ఉద్దేశ్యం లేదని అన్నారు. చిరంజీవిపై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. చిరంజీవి అంత సహజంగా ఎవరూ స్టెప్స్ వేయలేరనీ, ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వలేరనీ రెజీనా అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



