ENGLISH | TELUGU  

అక్కినేని 'మనం' సినిమాకి అవార్డు ఎందుకు రాలేదు..!

on May 31, 2025

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గద్దర్ అవార్డులను ఇటీవల ప్రకటించారు. 2024 ఏడాదికి గాను పలు విభాగాల్లో అవార్డులను అనౌన్స్ చేశారు. అలాగే 2014 నుంచి 2023 వరకు ప్రతి ఏడాది మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేశారు. అవార్డుల ఎంపిక పట్ల దాదాపు అందరూ సంతృప్తిగానే ఉన్నారు. కానీ 2014కి గాను ఉత్తమ చిత్రాలలో 'మనం' సినిమాకి చోటు దక్కకపోవడం హాట్ టాపిక్ మారింది.

 

అక్కినేని త్రయం నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మనం'. 2014 మేలో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా, క్లాసిక్ ఫిల్మ్ గా పేరు తెచ్చుకుంది. అలాంటి సినిమాకి గద్దర్ అవార్డ్స్ లో చోటు లభించలేదు. అయితే దీని వెనుక ఓ కారణముంది. అదేంటంటే, ఇవి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న అవార్డులు కాబట్టి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తర్వాత సెన్సార్ అయిన సినిమాలను పరిగణలోకి తీసుకున్నారు. దాంతో మేలో విడుదలైన 'మనం' సినిమా.. అవార్డుకి దూరమైంది.

 

2014కి గాను 'రన్ రాజా రన్', 'పాఠశాల', 'అల్లుడు శీను' సినిమాలు ఉత్తమ చిత్రాలుగా గద్దర్ అవార్డులకు ఎంపిక అయ్యాయి. 'పాఠశాల' సినిమా ఎంపిక పట్ల ఎవరూ ఎలాంటి అభ్యంతరం చెప్పరు. కానీ 'అల్లుడు శీను' లాంటి ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాని ఉత్తమ తృతీయ చిత్రంగా ఎంపిక చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత సెన్సార్ అయిన సినిమాలను పరిగణలోకి తీసుకోవడంతో.. ఉన్న వాటిలో బెటర్ అనిపించి 'అల్లుడు శీను'ని ఎంపిక చేశారని అంటున్నారు. ఏది ఏమైనా కటాఫ్ డేట్ 'అల్లుడు శీను'కి కలిసొచ్చిందని చెప్పవచ్చు.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.