రవితేజ లక్కీ మంత్ లో `ఖిలాడి`?
on Jul 26, 2021
`క్రాక్` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం `ఖిలాడి`. `రాక్షసుడు` ఫేమ్ రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు రవితేజ. యాక్షన్ కింగ్ అర్జున్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ అనంతరం.. ఈ రోజు (జూలై 26) నుంచి కొత్త షెడ్యూల్ కి శ్రీకారం చుట్టింది యూనిట్.
ఇదిలా ఉంటే.. `ఖిలాడి`ని రవితేజ లక్కీ మంత్స్ లో ఒకటైన సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. కుదిరితే వినాయక చవితి కానుకగా లేదంటే సెప్టెంబర్ ద్వితీయార్ధంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్. రవితేజ హీరోగా నటించిన తొలి చిత్రం `సిందూరం` (1997), తనకి కథానాయకుడిగా తొలి సూపర్ హిట్ ని అందించిన `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం` (2001).. అలాగే `పవర్` (2014) సినిమా.. ఇదే సెప్టెంబర్ లో విడుదలై విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో.. `ఖిలాడి`ని కూడా ఇదే నెలలో తీసుకురాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే `ఖిలాడి` రిలీజ్ డేట్ పై క్లారిటీ రానున్నది. మరి.. తన లక్కీ మంత్ లో మాస్ మహారాజా మరోసారి మెస్మరైజ్ చేస్తారేమో చూడాలి.
కాగా, `ఖిలాడి`లో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నాయికలుగా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.
Also Read