నిర్మాతగా రష్మిక?
on Mar 19, 2020
హిందీలో హీరోయిన్లు నిర్మాతలుగా మారుతున్నారు. తెలుగులో నిర్మాతలుగా మారిన హీరోయిన్లు తక్కువే. చాలా అరుదుగా కనిపిస్తారు. 'ఎన్.హెచ్10'తో ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టిన హిందీ హీరోయిన్ అనుష్కా శర్మ, ఆ తర్వాత 'పరి' నిర్మించారు. 'ఛపాక్'తో దీపికా పదుకొనె నిర్మాత అవతారం ఎత్తారు. తల్లి మధు చోప్రా పర్యవేక్షణలో ప్రియాంక చోప్రా మరాఠీ సినిమాలు నిర్మించారు. వీరి బాటలో రష్మిక మందన్న నడవాలి అనుకుంటున్నారా? త్వరలో ఆమె నిర్మాతగా మారబోతున్నారా? రీసెంట్ గా రష్మిక రిలీజ్ చేసిన వీడియో చూస్తే అటువంటి అనుమానాలు కలుగుతున్నాయి.
"దర్శకుడు కావాలనుకునే వారు, రచయితలు ఇంట్రెస్టింగ్ ఐడియాలు ఉంటే నాకు మెయిల్ చేయండి. నాకు ఒక చిన్న టీమ్ ఉంది. వచ్చిన మెయిల్స్ చదివి... ఇంట్రెస్టింగ్ గా అనిపించినవి సెలెక్ట్ చేసి, మెయిల్ ద్వారా మీతో టచ్ లో ఉంటాను. స్క్రిప్ట్ వర్క్ చేద్దాం" అని రష్మిక పేర్కొన్నారు. ప్రజెంట్ టాప్ తెలుగు హీరోయిన్లలో ఆమె ఒకరు. మహేష్ బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాల్లో నటించారు. అల్లు అర్జున్ పక్కన ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నారు. తమ సినిమాలో రష్మిక ను కథానాయికగా తీసుకోవాలని పలువురు దర్శకులు, నిర్మాతల క్యూ కడుతున్నారు. ఆమె వినాలే గాని కథలు చెప్పే వాళ్లకు కరువు లేదు. అలా కాకుండా ఇంట్రెస్టింగ్ ఐడియాలు మెయిల్ చేయమని... ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారంటే? కొత్త వాళ్లకు అవకాశం ఇస్తూ సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నారా అనే సందేహం కలుగుతోంది. ఏమో... గుర్రం ఎగరావచ్చు! వెయిట్ అండ్ సీ.