తెలుగునాట రజినీకాంత్ సంచలనం!
on Aug 18, 2025

సూపర్ స్టార్ రజినీకాంత్ పేరుకి తమిళ హీరో కానీ, ఆయనకు అన్ని చోట్లా అభిమానులున్నారు. రజినీకాంత్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు.. ఓ సెలబ్రేషన్ అన్నట్టుగా ఉంటుంది. తెలుగునాట కూడా ఆయనకు ఎందరో అభిమానులున్నారు. రజినీకాంత్ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో సాధిస్తున్న వసూళ్ళను దానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
తెలుగునాట ఇప్పటిదాకా ఆరు తమిళ సినిమాలు రూ.50 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరగా.. అందులో నాలుగు సినిమాలు రజినీకాంత్ వే కావడం విశేషం. మొదటిసారి 2010లో వచ్చిన 'రోబో'తో ఈ ఫీట్ సాధించారు రజినీ. '2.O', 'జైలర్' చిత్రాలతో మరో రెండుసార్లు 50 కోట్ల క్లబ్ లో చేరారు. ఇక ఇప్పుడు 'కూలీ'తో నాలుగోసారి ఈ ఫీట్ సాధించారు. రజినీకాంత్ సినిమాలు కాకుండా 'ఐ','అమరన్' మాత్రమే ఇప్పటిదాకా ఈ ఘనత సాధించాయి.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'కూలీ' సినిమాలో రజినీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ మూవీ.. పోటీగా 'వార్-2' ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



