పావలా పావలా అని కొట్టుకోవడం కాదు.. బన్నీ వాస్ షాకింగ్ కామెంట్స్!
on Jun 6, 2025
థియేటర్ల వ్యవస్థ బ్రతకాలంటే పర్సంటేజ్ సిస్టం తీసుకు రావాలని డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పర్సంటేజ్ సిస్టంకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. పర్సంటేజ్ సిస్టం గురించి కాకుండా, ముందు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఎలానో ఆలోచించాలని హితవు పలికారు. అలాగే పెద్ద హీరోలు వేగంగా సినిమాలు చేయాలని సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ పెట్టారు.
"ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని..! ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావలా.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి తప్ప.. ఇలాగ సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటిటికి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే.. రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూత పడినట్టైతే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళుతుంది." అని బన్నీ వాస్ రాసుకొచ్చారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
