ఎన్టీఆర్, అల్లు అర్జున్ బాటలో ప్రభాస్..!
on Jan 20, 2025
గతేడాది 'కల్కి 2898 AD'తో మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయి. వాటిలో 'ది రాజా సాబ్', 'ఫౌజీ' చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే ఇప్పుడు 'ఫౌజీ'కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం 'ఫౌజీ' (Fauji). భారత స్వాతంత్ర్యానికి ముందు 1940 సమయంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. ఈ సినిమాలో విభిన్న ప్రేమ కథ, కట్టిపడేసే భావోద్వేగాలతో పాటు అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇక ఈ 'ఫౌజీ' చిత్రంలో సైనికుడు పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని ముందు నుంచి జరుగుతున్న ప్రచారం. అయితే ఇప్పుడు ప్రభాస్ పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇందులో సైనికుడిగా మారిన బ్రాహ్మణ యువకుడిగా ప్రభాస్ కనిపించనున్నాడని తెలుస్తోంది. బ్రాహ్మణ యువకుడి పాత్రకు సంబంధించిన సన్నివేశాలను మధురై సమీపంలోని కారైకుడిలో త్వరలో చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్ 20 రోజులు ఉంటుందట.
ప్రభాస్ బ్రాహ్మణ యువకుడి పాత్రలో నటించడం ఇదే తొలిసారి. ఈ తరం స్టార్స్ లో 'అదుర్స్'లో జూనియర్ ఎన్టీఆర్, 'దువ్వాడ జగన్నాథం'లో అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకులుగా నటించారు. అయితే వారు పోషించిన పాత్రలు హాస్య ప్రధానంగా సాగుతాయి. ఇప్పుడు ప్రభాస్ పోషిస్తున్న పాత్రకు ఎమోషనల్ టచ్ ఉండే అవకాశముంది. లేదంటే సైనికుడిగా మారడానికి ముందు కొన్ని హాస్య సన్నివేశాలు ఏమైనా ఉంటాయేమో చూడాలి. ఏది ఏమైనా మిగతా బిగ్ స్టార్స్ తో పోలిస్తే.. ఇలా వరుసగా విభిన్న జానర్స్, విభిన్న పాత్రలు చేస్తున్న ప్రభాస్ ని మెచ్చుకోవాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
