నా సినిమాలో ఏముందో మీరు చూసారా??
on Mar 19, 2019
రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి తాజాగా రూపొందిస్తోన్న చిత్రం `ముఖ్యమంత్రిగారూ..మాటిచ్చారు``. అయితే ఈ సినిమాను నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి ఒక లెటర్ రావడంతో దానిపై పోసాని స్పందిస్తూ ఈ రోజు తన కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...``నేను సినిమాలో ఏం చూపించానో..ఏం చెప్పానో తెలియకుండా సినిమాను ఆపేయాలని ఎలా లేఖ రాస్తారు. నా సినిమా ఆపేయాలని ఎవడెవడో లెటర్స్ రాస్తుంటాడు. ఎలక్షన్ కమిటీ వాళ్లు అన్నింటికీ స్పందిస్తారా? అంటూ ఈసీ పై ఘాటుగా స్పందించారు. అసలు నా సినిమా గురించి నేను ఇంత వరకు అనౌన్స్ చేయలేదు. సినిమాకు సంబంధించి ఒక్క క్లిప్పింగ్ కూడా టీవీ లో వేయలేదు. ఒక్క సీన్ కూడా సెన్సార్ నిబంధనలకు లోబడే నా సినిమా తీసా. నా సినిమాలో ఏం చెడు ఉందని ప్రభావం చూపుతుంది. టీవీల ముందు కూర్చోని పార్టీల గురించి మాట్లాడుతున్నారు? అది ప్రభావితం చేయదా? నేను మంచి వాళ్లకు ఓటు వేయండి అని చెబుతున్నా. అంతే కానీ ఫలానా పార్టీకి ఓటు వేయండి అని చెప్పడం లేదు. నా సినిమా ఎవర్ని ప్రభావితం చేస్తుందంటే ఎవడు దొంగో వాడినే ప్రభావితం చేస్తుంది తప్ప మంచి వాడిని ప్రభావితం చేయదు అంటూ ఘాటుగా స్పందించారు. మీరు మాత్రం రోజు దేశ ప్రధానిని తిట్టొచ్చు. పవన్ కళ్యాన్ ని ఆడవారితో తిట్టించవచ్చు. నేను మాత్రం సినిమాలో చూపించకూడదు. అయినా జనాలు అమాయికులేం కాదు ఎవరు? ఏది చెప్పినా వారు గెలిపించే వాళ్లనే గెలిస్తారు అంటూ చంద్రబాబు పై మండిపడ్డారు పోసాని.