వరుస సినిమాలతో పూజా బిజీ బిజీ!!
on Jun 24, 2019
టాలీవుడ్ లో ప్రజంట్ టాప్ హీరోయిన్ల సరసన నిలిచింది గ్లామర్ బ్యూటి పూజా హెగ్డే. ఇటీవల మహర్షితో సందడి చేసిన ఈ భామ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. అలాగే స్టైలిష్ స్టార్ బన్ని , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రంలో కూడా పూజానే హీరోయిన్ . అలాగే వరుణ్ తేజ్ సరసన `వాల్మీకి` లో కూడా నటస్తోంది. ఇలా వరుస సినిమాలతో స్టార్ హీరోలతో నటిస్తోన్న పూజా హెగ్డే బాలీవుడ్ లో కూడా బిజీ కాబోతుంది. ఒకసారి వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ లో ప్రస్తుతం `హౌస్ ఫుల్ ` చిత్రంలో నటిస్తోంది పూజా. దీనితో పాటు మరో రెండు బాలీవుడ్ లో చేయనుందని సమాచారం. అందులో ఒకటి సునీల్ శెట్టి, జాన్ అబ్రహమ్ , ఇమ్రాన్ హష్మీ హీరోలుగా సంజయ్ గుప్త దర్శకత్వంలో రూపొందుతోన్న `ముంబయి సాగా` లో హీరోయిన్ గా ఫైలన్ అయిందట పూజా. అలాగే మరో సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయట. ఇలా తెలుగు , హిందీ సినిమాలతో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది పూజా హెగ్డే.