ENGLISH | TELUGU  

దేవరను ఫాలో అవ్వండి.. ఓజీ టీమ్ కి పవన్ ఫ్యాన్స్ సూచన!

on Sep 29, 2025

 

అధిక టికెట్ ధరల కారణంగా థియేటర్ కి వెళ్ళి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోందనే అభిప్రాయం ఉంది. అయినప్పటికీ చాలా మంది మేకర్స్.. టికెట్ హైక్ కి మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల భారీ ఓపెనింగ్స్ అయితే వస్తున్నాయి కానీ.. రెండో రోజు నుంచి ఫుట్ ఫాల్స్ తగ్గిపోతున్నాయి. లాంగ్ రన్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ గుర్తించలేకపోతున్నారు. తాజాగా ఓజీ విషయంలోనూ అదే జరుగుతుందని, దీని వల్ల సినిమా నష్టపోతుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (They Call Him OG)

 

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ 'ఓజీ' సెప్టెంబర్ 25న విడుదలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రీమియర్ షోలతో పాటు.. టికెట్ ధరల పెంపుకి అనుమతి ఇచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణలో ఇప్పటికే టికెట్ ధరలు ఎక్కువ ఉన్నాయి. దానికి తోడు హైక్ ఇవ్వడంతో మల్టీప్లెక్స్ లలో ఒక్కో టికెట్ ధర దాదాపు రూ.500 ఉంది. దీంతో ఫుట్ ఫాల్స్ పై ప్రభావం పడుతుంది.

 

నైజాంలో మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన సినిమాలు ఇక్కడ భారీ వసూళ్లు రాబడుతుంటాయి. పైగా దసరా సెలవులు కూడా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టే ఛాన్స్ ఉంది. కానీ, టికెట్ రేట్స్ చూసి వారు వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. 

 

గతంలో నైజాంలో జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' మూవీ టీమ్ ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యి సక్సెస్ అయింది. మొదటి రోజు టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత నుంచి తగ్గించారు. దాంతో ఫుట్ ఫాల్స్ పెరిగాయి. లాంగ్ రన్ లో మంచి వసూళ్లు రాబట్టి.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓజీ టీమ్ కూడా దేవర స్ట్రాటజీ ఫాలో అయ్యి.. టికెట్ రేట్స్ తగ్గించి, ఫుట్ ఫాల్స్ పెంచుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. మరి అభిమానుల సూచనలను ఓజీ టీమ్ పట్టించుకుంటుందో లేదో చూడాలి.

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.