కోటీశ్వరుడు కాబోతున్నరామ్
on May 19, 2014
‘మసాలా’ చిత్రం తర్వాత రామ్ తాజాగా ఓకే చెప్పి న చిత్రం ‘పండగ చేస్కో’. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఏడాది విరామం తర్వాత రామ్ చేస్తున్నఈ సినిమా కథా రచయిత వెలిగొండ శ్రీనివాస్. మసాల చిత్రానికి ముందే ఈ కథ విన్న రామ్ కి, కథ ఈ ఎంతగానో నచ్చిందన్నారు. థియేటర్ కి వచ్చిన ఎవరైనా ఈ సినిమా చూసిన తర్వాత తప్పకుండా బాగుందనే చెప్తారని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు రామ్.
ఇక కథా రచయిత వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ కథ రామ్ కోసమే రాసిన కథ అని, ఓ కోటీశ్వరుడు భారతదేశం వచ్చి ఏం చేశాడు? అనేదే ఈ చిత్రకథ అని చెప్పారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రామ్, రకుల్ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రన్నిపరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు.
శనివారం ప్రారంభమైన ఈ షూటింగ్ ముహూర్తానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇవ్వగా, ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత దర్శకుడు మాట్లాడుతూ రామ్ ఎనర్జీ మొత్తం ఈ సినిమాలో కనిపిస్తుందని, ‘బలుపు’ తర్వాత కొంత సమయం తీసుకున్నా మంచి కథ కుదిరిందన్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారన్నారు.
గోపీచంద్, రామ్లతో ముచ్చటగా మూడో సారి పనిచేస్తున్నాని ఈ సినిమా తప్పకుండా హ్యాట్రిక్ సాధిస్తుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ప్లే-మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: అనిల్ రావిపూడి.