ENGLISH | TELUGU  

చిరంజీవి పేరుపై కోటి ఇరవై ఐదు లక్షలతో పార్క్..ప్రారంభించిన ఎంఎల్ఏ 

on May 16, 2025

తెలుగు చిత్ర పరిశమ్రలో నాలుగు దశాబ్దాలుగా అగ్ర హీరోగా కొనసాగుతు వస్తున్న చిరంజీవి(Chiranjeevi)తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అశేష అభిమానులని సంపాదించుకున్నాడు. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు వంటి వాటిని నిర్వహిస్తు పలువురికి ఆదర్శంగా కూడా నిలిచాడు. దీంతో సినీ,సామజిక సేవలకి  గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్(Padma Bhushan)పద్మవిభూషణ్(Padma Vibhushan)వంటి ప్రతిష్టాత్మక అవార్డులతో గౌరవించింది. 

రీసెంట్ గా చిరంజీవి పేరుపై ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లోని రాజమండ్రి(Rajahmundry)లో ఉన్న కంబాల చెరువు జంక్షన్ వద్ద  డాక్టర్ పద్మవిభూషణ్ చిరంజీవి పార్క్(Dr Padmavibhushan Chiranjeevi)అనే పేరుతో ఒక పార్క్ ఏర్పాటయింది. బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు విగ్రహంతో పాటు, ఆయనతో పాటు స్వతంత్ర పోరాటంలో పాల్గొని అమరులైన సీతారామరాజు అనుచరుల విగ్రహాలు కూడా పార్క్ లో ప్రతిష్ఠించారు. పార్క్ ని ప్రారంభించిన రాజమండ్రి సిటీ ఎం ఎల్ ఏ ఆదిరెడ్డి శ్రీనివాస్(Adireddy Srinivas)మాట్లాడుతు కేంద్ర మంత్రి గా చిరంజీవి గారు ఉన్నప్పుడే ఈ పార్క్ ని ప్రారంభించాల్సింది. కానీ అప్పుడు కుదరలేదు. అప్పట్నుంచి ఆయన అభిమానులే పార్క్ బాగోగులు చూసుకుంటున్నారు. ఇప్పుడు 'రుడా' చైర్మన్ బొడ్డు వెంకట్రామయ్య చౌదరి సహాయం తీసుకుని పద్మ విభూషణ్  చిరంజీవి గారి పేరుపై కోటి ఇరవై ఐదు లక్షలతో పార్క్ ని నిర్మించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు.     

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర(Vishwambhara)అనే మూవీతో పాటు సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకతంలో ఒక మూవీ చేస్తున్నాడు. వీటిల్లో 'విశ్వంభర' మొదటగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

 

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.