ఏడాది పూర్తి చేసుకున్న సంచలన చిత్రం రాజధాని ఫైల్స్
on Feb 15, 2025
శ్రీమతి హిమబిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ నిర్మించిన చిత్రం 'రాజధాని ఫైల్స్'. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల కన్నీటి గాథను కళ్ళకి కట్టినట్టు చూపించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. 2024, ఫిబ్రవరి 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తెలుగునాట సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. (Raajadhani Files)
ఒక నాయకుడు తన స్వార్ధం కోసం, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలనే ఉద్దేశంతో.. ఎలాంటి దుర్మార్గాలు చేశాడో తెలిపిన చిత్రం 'రాజధాని ఫైల్స్'. ఈ సినిమాలో కంటతడి పెట్టించే సన్నివేశాలతో పాటు.. పిడికిలి బిగించి పోరాడాలనే స్ఫూర్తిని నింపే సన్నివేశాలు కూడా ఉన్నాయి. "రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే రాజధాని ఉండాలి" అనే సందేశాన్ని ఇచ్చిన ఈ చిత్రం.. రాజధాని కోసం పోరాడేలా ఎందరిలోనూ స్ఫూర్తి నింపింది.
రాష్ట్రానికి రాజధాని ఎంత ముఖ్యమో తెలుపుతూ, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన రాజధాని ఫైల్స్ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగువన్ యూట్యూబ్ ఛానల్ వేదికగా డిజిటల్ ఎంట్రీ ఇవ్వగా.. అక్కడా రికార్డు వ్యూస్ సాధించింది. ఇలా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రాజధాని ఫైల్స్ సినిమా విడుదలై నేటికి ఏడాది పూర్తయింది.
అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ ప్రధాన పాత్రలు పోషించిన 'రాజధాని ఫైల్స్' చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. సినిమాటోగ్రాఫర్ గా రమేష్, ఆర్ట్ డైరెక్టర్ గా గాంధీ, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు వ్యవహరించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
