యన్.టి.ఆర్., పూరీ సినిమా ఆగస్టులో
on Feb 2, 2012
యన్.టి.ఆర్., పూరీ సినిమా ఆగస్టులో ప్రారంభం అవుతుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, యంగ్ టైగర్ యన్.టి.ఆర్. హీరోగా డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మించబోయే చిత్రం ఆగస్టులో ప్రారంభమవుతుది.
ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో, అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న "దమ్ము" చిత్రంలో యన్.టి.ఆర్. హీరోగా నటిస్తున్నారు. దీని తర్వాత శీను వైట్ల దర్శకత్వంలో ని చిత్రంలో యన్.టి.ఆర్. హీరోగా నటిస్తారు. అలాగే పూరీ జగన్నాథ్ కూడా రవితేజ సినిమా, తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు పూర్తిచేసి యన్.టి.ఆర్. హీరోగా నటించే సినిమాకు దర్శకత్వం వహిస్తారు.