న్యూసెన్స్ కేసుపై నిహారిక భర్త చైతన్య రియాక్షన్
on Aug 5, 2021
మెగా డాటర్ నిహారిక భర్త చైతన్యపై అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. నిహారిక ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని.. అపార్ట్ మెంట్ వాసులకు, చైతన్యకు మధ్య గొడవ జరిగిందని ఇలా రకరకాల వార్తలొచ్చాయి. దీంతో అసలు గొడవ ఏంటి?.. చైతన్యపై అపార్ట్ మెంట్ వాసులు ఎందుకు ఫిర్యాదు చేశారు? అంటూ చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా చైతన్య ఈ వివాదంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
''ప్రొడక్షన్ ఆఫీస్ కోసం ఓనర్ అనుమతితో ఒక ఫ్లాట్ ను రెంట్ కు తీసుకున్నాం. అయితే ఫ్లాట్ ను కమర్షియల్ పర్పస్ కోసం ఉపయోగిస్తున్నామని అపార్ట్ మెంట్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆగష్టు 10న ఫ్లాట్ ఖాళీ చేయబోతున్నామని ఓనర్ కు చెప్పాము. అయితే ఆగస్టు 2న రాత్రి 25 మంది ఫ్లాట్ కి వచ్చి గొడవ చేశారు. ఆఫీస్ లోకి అక్రమంగా ప్రవేశించి గొడవ చేయడంతో నేను వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ తర్వాత దానికి కౌంటర్ గా వారు నాపై ఫిర్యాదు చేశారు. కానీ మీడియాలో ముందు వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత నేను చేసానని వస్తోంది. అది నిజం కాదు." అని చెప్పుకొచ్చారు.
''బంజారాహిల్స్ పోలీసులు ఇరువురినీ స్టేషన్కు పిలిపించి మాట్లాడారు. అపార్ట్ మెంట్ వాసులు మాకు క్షమాపణలు చెప్పారు. దీంతో నేను కంప్లైట్ వెనక్కి తీసుకున్నాను. వాళ్ళు కూడా కంప్లైంట్ వెనక్కి తీసుకున్నారు. వాస్తవాలను ధృవీకరించుకొని రిపోర్టింగ్ చేయాల్సిందిగా మీడియా మిత్రులను కోరుతున్నాను" అని చైతన్య పేర్కొన్నారు.
Also Read