అప్పుడు గెస్ట్ ఇప్పుడు హీరో..!
on Oct 22, 2021
లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డికి మంచి గుర్తింపుని తీసుకువచ్చిన చిత్రాల్లో `ఓ బేబి` (2019) ఒకటి. సమంత కథానాయికగా నటించిన ఈ ఫాంటసీ కామెడీ మూవీలో అక్కినేని నాగచైతన్య అతిథి పాత్రలో సందడి చేశారు. రాజేంద్ర ప్రసాద్ పోషించిన చంటి పాత్రకి యంగ్ వెర్షన్ లా క్లైమాక్స్ లో గెస్ట్ గా ఎంటర్టైన్ చేశారు చైతూ. కట్ చేస్తే.. త్వరలో నందినీ రెడ్డి కాంబినేషన్ లో ఓ ఫుల్ లెన్త్ మూవీ చేయనున్నారట నాగచైతన్య.
ఆ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం సంతోష్ శోభన్ తో `అన్నీ మంచి శకునములే` అనే పేరుతో ఓ సినిమా చేస్తున్న నందినీ రెడ్డి.. ఆ చిత్రం తరువాత విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ మూవీ చేయాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాల వల్ల విజయ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా, అదే కథని రీసెంట్ గా నాగచైతన్యకి వినిపించారట నందిని. కథ నచ్చడంతో సినిమాకి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట చైతూ. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మించనుందని బజ్. అంతేకాదు.. 2022 ప్రథమార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముందని సమాచారం. మరి.. నందినికి గెస్ట్ గా అచ్చొచ్చిన నాగచైతన్య.. పూర్తి స్థాయి చిత్రంతోనూ కలిసొస్తారేమో చూడాలి.
కాగా, ప్రస్తుతం చైతూ `థాంక్ యూ`, `బంగార్రాజు` చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలాగే విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఓ వెబ్ - సిరీస్ చేయబోతున్నారు.