బిగ్ ట్విస్ట్.. రామ్ చరణ్ తో త్రివిక్రమ్.. అంతా ఫేక్..!
on Jun 12, 2025
దర్శకుడు త్రివిక్రమ్ గత చిత్రం 'గుంటూరు కారం' 2025 జనవరిలో విడుదలైంది. ఆ సినిమా వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు త్రివిక్రమ్ కొత్త సినిమా పట్టాలెక్కలేదు. నిజానికి అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆయన అనూహ్యంగా అట్లీ ప్రాజెక్ట్ తో బిజీ కావడంతో త్రివిక్రమ్ కాస్త డైలమాలో పడ్డారు. దాని నుంచి తేరుకొని, ఆ గ్యాప్ ను భర్తీ చేసేలా.. ఒకేసారి మూడు ప్రాజెక్ట్ లను త్రివిక్రమ్ లైన్ లో పెట్టారని వార్తలొచ్చాయి.
త్రివిక్రమ్ చేయబోయే నెక్స్ట్ మూడు ప్రాజెక్ట్ లలో వెంకటేష్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే వీటిలో చరణ్ ప్రాజెక్ట్ విషయంలో బిగ్ ట్విస్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ లాక్ కాలేదని అర్థమొచ్చేలా తాజాగా నిర్మాత నాగవంశీ ఓ ట్వీట్ చేశారు. "త్రివిక్రమ్ గారి తదుపరి 2 ప్రాజెక్టులు వెంకటేష్ గారు, ఎన్టీఆర్ అన్నతో లాక్ అయ్యాయి. మిగతావన్నీ కేవలం ఊహాగానాలు. త్రివిక్రమ్ గారిది ఏదైనా ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే స్వయంగా మేమే ప్రకటిస్తాము." అని నాగవంశీ రాసుకొచ్చారు.
త్రివిక్రమ్ మొదట వెంకటేష్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్, నెక్స్ట్ రామ్ చరణ్ తో యాక్షన్ ఎంటర్టైనర్ చేసి.. ఆ తర్వాత ఎన్టీఆర్ తో భారీ బడ్జెట్ మైథలాజికల్ ఫిల్మ్ చేస్తారని న్యూస్ చక్కర్లు కొట్టాయి. కానీ, తాజా నాగవంశీ ట్వీట్ ని బట్టి చూస్తే.. వెంకటేష్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని అర్థమవుతోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
