గుండెను పిండేసిన ఎన్టీఆర్ స్పీచ్
on Oct 2, 2018
అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో అంగరంగవైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్పీచ్ ప్రతి ఒక్కరి గుండెను పిండేసేలా ఉంది. 'త్రివిక్రమ్ తో సినిమా చేయాలని పన్నెండేళ్ల కల.. అరవింద సమేతతో ఆ కల నెరవేరింది' అంటూ ఎన్టీఆర్ స్పీచ్ స్టార్ట్ చేసారు. మనిషి ఎలా ఉండాలో.. మనిషి మనిషిలా ఎలా బ్రతకాలో తెలిపే సినిమా అరవింద సమేత అన్నారు. అదే విధంగా 'నెల రోజులు క్రితం మా ఇంట్లో విషాదం జరిగింది' అంటూ హరికృష్ణ మృతిని గుర్తుతెచ్చుకొని కన్నీరు పెట్టుకున్నారు. తండ్రికి కొడుకుగా ఎలా ఉండాలో? కొడుకుకి తండ్రిగా ఎలా ఉండాలో? భార్యకి భర్తగా ఎలా ఉండాలో? ఆయన్ని చూసి నేర్చుకోవాలి అంటూ హరికృష్ణ గొప్పతనాన్ని చెప్పారు. తండ్రి మరణంతో విషాదంలో ఉన్న తనకు త్రివిక్రమ్ ఒక అన్నలా, ఒక మిత్రుడిలా, ఒక తండ్రిలా అండగా ఉన్నారంటూ కన్నీరు పెట్టుకున్నారు.
నాన్న గారి ఆశీస్సులతో ఈ సినిమా హిట్ అయ్యి మా బంధం మరింత బలపడాలని కోరుకుంటున్న అన్నారు. ఇలా హరికృష్ణను గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడిన ఎన్టీఆర్.. మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు.. మనిషి పోయాక విలువ తెలిసినా పక్కన ఉండరు అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. అదేవిధంగా అభిమానులను ఉద్దేశించి.. మా నాన్నకు చెప్పలేకపోయాను.. మీకు చెప్తున్నాను.. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి.. మీ కోసం మీ కుటుంబం ఎదురు చూస్తుంది అన్నారు. హరికృష్ణ మరణంతో విషాదంలో ఉన్న ఎన్టీఆర్ స్పీచ్ మాట్లాడుతూ పలు సార్లు కన్నీరు పెట్టుకున్నారు.