మహేష్ తో వస్తున్న దీపిక
on Jul 3, 2013
బాలీవుడ్ వైపు తను వెళ్ళకుండా... బాలీవుడ్ హీరోయిన్ లను తెలుగు ఇండస్ట్రీకి రప్పిస్తున్నాడు ప్రిన్స్ మహేష్. మహేష్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న "శివం" అనే చిత్రం చిత్రంలో హీరోయిన్ గా సోనాక్షి సిన్హా ను ఎంపిక చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా మరో హీరోయిన్ కూడా బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి రానుంది.
మహేష్ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో "ఆగడు" అనే చిత్రం తెరకెక్కబోతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. తన అందాలతో బాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఈ అమ్మడు నటించే మొదటి తెలుగు చిత్రం మహేష్ తో కావడం వల్ల అభిమానులతో పాటు దీపిక కూడా ఎదురు చూస్తుందట. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.