సినీపరిశ్రమలో ఆకస్మిక మరణాలపై హోమం
on Mar 14, 2015
.jpg)
గత కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాలపై తెలుగు సినీ పెద్దలు ఉలిక్కిపడ్డారు. దీనిని చాలా సీరియస్ గా పరిగణించడంతో పాటు వెంటనే పరిహార చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అందుకోసం పెద్దలంతా చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చారు. ఇది కచ్చితంగా ఏదో దోషమే అని తేల్చి దానికి పరిహరించుకోవడానికి హోమం చేయాలని నిశ్చయించారు. వేద పండితుల సలహాతో చివరకు “పాశుపత మహా మృత్యుంజయ హోమం” చేయడానికి సిద్ధమయ్యారు. దీనిని స్వయంగా శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కీడు తొలగకపోతే ఇంకా ఇలాంటి దుర్వార్తలు వినాల్సి వస్తుందని ఈనెలలోనే హోమం చేయాలని నిర్ణయించి దానికి మార్చి 23, 24, 25 తేదీలను సమయంగా నిర్ణయించారు. ఈ విషయాన్ని స్వయంగా తెలుగు నటుడు, ఎంపీ మురళీమనోహర్ ప్రకటించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



