ఎమ్మెస్ నారాయణ మృతి అంటూ పుకార్లు
on Jan 22, 2015
ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఎమ్మెస్ నారాయణ చనిపోయారంటూ కొన్ని ప్రధాన ఛానళ్లు స్కోలింగ్ని వేశాయి. దాంతో చిత్రసీమలో కలకలం మొదలైంది. అయితే ఎమ్మెస్ చనిపోలేదని, అయితే ఆయన పరిస్థితి క్రిటికల్గా ఉందని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. దాంతో టీవీ ఛానళ్లు నాలుక కరుచుకొని.. స్కోలింగ్ని ఆపేశాయి. ఈ విషయంలో ఎమ్మెస్ కుమారుడు విక్రమ్ కూడా ఈ వార్తలపై మండిపడ్డారు. ``నాన్న బాగానే ఉన్నారు. ఆయనకు ఏం కాలేదు.. దయచేసి పుకార్లు ఆపండి`` అని అభ్యర్థించారు.