అతిథిగా వచ్చి హీరోయిన్ అయ్యింది!
on Nov 9, 2014
మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది లావణ్య త్రిపాఠీ. అదీ ఒక్క నిమిషం కూడా ఉండదు. హీరోయిన్ గా చేయాల్సిన సమయంలో ఇలాంటి పాత్రలేంటి?? అని చాలామంది పెదవి విరిచారు. అయితే ఆ పరిచయం, అనుభవం ఇప్పుడు లావణ్య త్రిపాఠీకి పనికొచ్చాయి... ఇప్పుడు ఏకంగా అక్కినేని కాంపౌండ్ హీరోయిన్ అయిపోయింది. నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ''సోగ్గాడే చిన్ని నాయనా'' అనే పేరు పరిశీలిస్తున్నారు. ఇందులో కథానాయికగా లావణ్య త్రిపాఠీని ఎంచుకొన్నారని సమాచారమ్. మరో నాయిక పాత్రలో రమ్యకృష్ణ నటించనుంది. ఈ సినిమాలో నాగ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. నిధి అన్వేషణకు సంబంధించిన కథ ఇది. ఈ నెలలోనే చిత్రీకరణ మొదలవుతుంది.
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



