దళిత యువకుడిపై సినీ రచయిత కోన వెంకట్ దాడి.. మరీ ఇంత దారుణమా!
on May 12, 2024
ప్రముఖ సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వైసీపీకి మద్దతుదారుడన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల వేళ, టీడీపీలో చేరిన ఓ దళిత యువకుడిపై కోన వెంకట్ దాడికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది.
బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతికి కోన వెంకట్ దగ్గరి బంధువు. అలాగే కర్లపాలెం మండలం వైసీపీ ఇంఛార్జిగా కోన వెంకట్ ఉన్నాడు. అయితే కర్లపాలెం మండలంలోని గణపవరానికి చెందిన దళిత యువకుడు కత్తి రాజేష్.. తన అనుచరులతో కలిసి శనివారం టీడీపీలో చేరాడు. అయితే రాజేష్ తమకి డబ్బులు ఇవ్వాల్సి ఉందంటూ వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతన్ని స్టేషన్ కి తీసుకొచ్చారు. అయితే కర్లపాలెం పోలీస్ స్టేషన్ లో ఎస్సై జనార్దన్ సమక్షంలోనే.. కోన వెంకట్ మరియు ఇతర వైసీపీ నేతలు రాజేష్ పై దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడి విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు, స్థానికులు పెద్దఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని.. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పైఅధికారులు.. ప్రాధమిక నివేదిక ఆధారంగా కోన వెంకట్ సహా దాడికి పాల్పడిన వైసీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అలాగే ఎస్సై జనార్దన్ ని సస్పెండ్ చేశారు.
Also Read