బాలీవుడ్ హీరోలిద్దరూ స్నానం చేయకూడదంటున్న కియారా
on Oct 23, 2020
బాలీవుడ్ నటి నేహా ధుపియా టాక్ షో 'నో ఫిల్టర్ విత్ నేహా'కి హీరోయిన్ కియారా అద్వానీ వెళ్ళింది. నేహా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అయితే... అందులో ఓ ప్రశ్నకు కియారా చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. బహుశా... ఈ ప్రశ్న మరొకరు అడిగితే కియారా ఎలా రియాక్ట్ అయ్యేదో? 'లస్ట్ స్టోరీస్'లో తనతో కలిసి నటించిన నేహా ధుపియా అడగడంతో సరదాగా ఆన్సర్ ఇచ్చింది. అసలు ఆ ప్రశ్నంటి? అనే విషయానికి వస్తే...
"ఎవరిని చూస్తే ఎప్పుడూ స్నానం చేయకుండా ఉంటే బావుంటుందని అనిపిస్తుంది?" అని కియారా అద్వానీని నేహా అడిగింది. మొదట కొంచెం వింతగా 'ఈక్' అని చెప్పిన కియారా, తరువాత హృతిక్ రోషన్, ఆదిత్యా రాయ్ కపూర్ పేర్లు చెప్పింది. "వాళ్ళిద్దరూ షవర్ చేయకుండా ఉంటే రగ్గడ్, కూల్ లుక్ లో చూడాలని కోరుకుంటాం ఏమో" అని చెప్పింది.
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా అద్వానీ ప్రేమలో ఉందని వస్తున్న వార్తలపైనా ఆమె స్పందించింది. పెళ్లి అయ్యేవరకూ తాను సింగిల్ గానే ఉంటానని చెప్పుకొచ్చింది. పెళ్లి కాలేదు కాబట్టి తాను సింగిల్ అని చెప్పింది.
Also Read