ENGLISH | TELUGU  

అఫీషియల్: మహేష్‌తో కీర్తీ సురేష్

on Oct 17, 2020

సూపర్‌స్టార్ మహేష్‌బాబు సరసన కథానాయికగా నటించే అవకాశం కీర్తీ సురేష్‌ని వరించిందనేది పాత మాటే. ఈ రోజు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా నటించనున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఇందులో మహేష్‌కి జోడీగా కీర్తీ నటించనున్నారు. ఈ రోజు కీర్తీ సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ 'సర్కారు వారి పాట' బృందం ఈ విషయం చెప్పింది.

అమెరికా నేపథ్యంలో బ్యాంకు మోసాలు, వైట్ కాలర్ క్రిమినల్స్ కథాంశంతో 'సర్కారు వారి పాట' సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించనున్నారు. నిజం చెప్పాలంటే ఈ నెలలో అమెరికా వెళ్లి చిత్రీకరణ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, వీసా సమస్యల వలన అమెరికా ప్రయాణాన్ని వచ్చే ఏడాది జనవరి వాయిదా వేశారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.