ఇక పై ఇటలీలో రభస
on Jul 9, 2014
జూనియర్ ఎన్టిఆర్ తో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న రభస చిత్రం షరవేగంగా షూటింగ్ పనులు పూర్తి చేసుకుంటోంది. సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర యూనిట్ ఈ నెల 13 నుంచి పాటల చిత్రీకరణ గురించి ఇటలీకి వెళ్లనున్నట్లు సమాచారం. పాటల చిత్రీకరణ పూర్తయిన తర్వాత 23, 24 తేదీల్లో ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టిఆర్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి
తమన్ సంగీతం అందిస్తున్నారు.