మహేశ్ బాబుతో జాక్వలైన్ చిందులు?
on Jun 18, 2021
ఆ మధ్య ``బ్యాడ్ బాయ్`` అంటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి పాన్ - ఇండియా మూవీ `సాహో`లో చిందులేసిన శ్రీలంక సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్.. త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న పిరియడ్ డ్రామా `హరిహర వీరమల్లు`లో ఇద్దరు కథానాయికల్లో ఒకరిగా ఈ హాట్ బ్యూటీ దర్శనమివ్వనుంది. ఈ సినిమా కూడా పాన్ - ఇండియా మూవీగానే రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. ప్రభాస్, పవన్ తరువాత మరో టాలీవుడ్ టాప్ స్టార్ తో జట్టుకట్టనుందట జాక్వలైన్. ఆ వివరాల్లోకి వెళితే.. `గీత గోవిందం` ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా `సర్కారు వారి పాట` పేరుతో ఓ సోషల్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేశ్ కి జంటగా కీర్తి సురేశ్ నటిస్తోంది. కాగా, ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతానికి స్థానముందట. అందులో జాక్వలైన్ ని నర్తింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే `సర్కారు వారి పాట`లో జాక్వలైన్ ఎంట్రీపై క్లారిటీ రానున్నది. మరి.. `సర్కారు వారి పాట`కి జాక్వలైన్ చిందులు ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.