ఇళయరాజాని కోర్టుకి లాగిన నిర్మాతలు!!
on Dec 24, 2018
నిత్యం మనం ఎక్కడో చోట ఇళయరాజా పాటలు వింటూనే ఉంటాం. అలాగే ఈ సంగీత దిగ్గజం పేరు ప్రస్తుతం వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది. అది కూడా వివాదాస్పదమైన వార్తల్లో. అవును ఒకప్పుడు ఆయన్ను దేవుడు అన్నవాళ్లే ఇప్పుడు ఆయన పెడుతున్న నిబంధనలను చూసి ఆయన్నువిలన్ లా చూస్తున్నారు. ఆయన్ను గురువుగా గారూ అంటూ పిలిచిన ఎంతో మంది ఇది మీకు తగదు అంటూ నిలదీస్తున్నారు.
ఇటీవల తన పాటలు తాను తప్ప మరొకరు పాడకూడదనీ, అందుకు తప్పనిసరిగా ఆయన అనుమతి తీసుకోవాలంటూ మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఆ మధ్య గానగంథర్వుడు బాలసుబ్రహ్మణ్యంను కూడా వదల్లేదు. తన పాటలపై ఫుల్ రైట్స్ తనవే ననీ వాదిస్తున్నాడు. అయితే ఇళయరాజా వైఖరి నచ్చని తమిళ నిర్మాతలు కొందరు ...ఇళయరాజాతో పాటు మాకు కూడా యాభై శాతం రాయల్టీ ఇప్పించాల్సిందిగా మద్రాసు హైకోర్టులో ఆయనకు వ్యతిరేఖంగా పిటిషన్ వేశారు. సంగీత దర్శకుడు ట్యూన్స్ ఇస్తున్నా...దాన్ని భరించేది, అసలు ట్యూన్స్ చేయించేది నిర్మాతే కాబట్టి మాకు సగం రాయల్టీ కావాల్సిందే అంటున్నారు. అయినా...పాటలపై పూర్తి హక్కు ఉందని ఇళయరాజా చెప్పడం విడ్డూరంగా ఉందని నిర్మాతలు వాదన. మరి నిర్మాతలు ఇళయరాజా పై వ్యతిరేఖంగా వేసిన పిటిషన్ పై మద్రాసు హై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.