రాశీఖన్నా వెక్కి వెక్కి ఏడ్వాలనుకుందట!
on Feb 6, 2020
మీరు చదివింది నిజమే... ఒకానొక సమయంలో అర్ధరాత్రుళ్లు కథానాయక రాశీ ఖన్నా వెక్కి వెక్కి ఏడ్వాలనుకున్నారట! ఈ ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పారు. ఎందుకు ఏడవాలని అనుకున్నారు? కారణాలు ఏమిటి? అనేది వివరంగా చెప్పలేదు గానీ... పలు కారణాల వల్ల ఏడవాలని అనుకున్నట్లు అన్నారు.
విజయ్ దేవరకొండ సరసన రాశీ ఖన్నా ఒక కథానాయికగా నటించిన సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్'. ప్రేమికుల దినోత్సవం కానుక ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సినిమాలో యామిని పాత్రలో రాశీ ఖన్నా నటించారు. నటిగా తన ప్రయాణంలో యామిని పాత్ర అత్యంత క్లిష్టమైన పాత్ర అని ఆమె చెప్పారు. ఇంకా ఈ సినిమా గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ "చాలాసార్లు అర్ధరాత్రుళ్లు నా మనసులో బాధ అంతా బయటకు వచ్చేలా గట్టిగా ఏడవాలని అనుకున్నాను. అయితే... రెండో రోజు వాచీన కళ్ళతో షూటింగ్ కు వెళ్ళితే బాగోదని మానేసి మౌనం గా ఉండేదాన్ని. యామిని అటువంటి పాత్రే" అని అన్నారు.
'వరల్డ్ ఫేమస్ లవర్' టీజర్ విడుదల అయిన తర్వాత చాలా విమర్శలు వచ్చాయి. 'అర్జున్ రెడ్డి 2'లా ఉందని కామెంట్లు వినిపించాయి. అవన్నీ చూసి రాశీ ఖన్నా నవ్వుకున్నారట. "టీజర్ విడుదలైన తర్వాత చాలా మంది చాలా రకాలుగా విశ్లేషించారు. కొంతమంది అర్జున్ రెడ్డి టూ అన్నారు. మరి కొంతమంది 'నాలుగు కథల సమాహారమే ఈ సినిమా' అని అన్నారు. ఇంకొందరు 'కేరాఫ్ కంచరపాలెం' తరహాలో ఒక వ్యక్తి జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరించారని రాసుకొచ్చారు. అవన్నీ చదువుతుంటే నవ్వొస్తుంది. అసలు కథ ఏమిటనేది నేను చెప్పను. వెండితెరపై సినిమా చూడండి" అని రాశీ ఖన్నా అన్నారు.
Also Read