నీ ఇంట్లో ఆడోళ్లే నీ ముఖంపై ఉమ్మేయాలి!
on Nov 25, 2017
‘సినిమా వాళ్ల భార్యలు రోజుకొక మొగుడ్ని మారుస్తారు’ అని... కేంద్ర మంత్రి చింతామణి మాలవీయ వివాదాస్పద వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ మాటలకు మద్దతు పలుకుతూ... ‘తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అదే పరిస్థితి’ అని ఓ టీవీ ఛానల్ సాక్షిగా వ్యాఖ్యానించాడు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. దీనిపై ఒక్క తమ్మారెడ్డి భరద్వాజ మినహా... తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవరూ స్పందించకపోవడం తెలిసిందే. అయితే.. రీసెంట్ గా ఈ వ్యాఖ్యలపై యువ హీరో సుధీర్ బాబు ఘాటుగా స్పందించాడు. ‘ఎమ్మెల్యే రాజా సింగ్.. సిగ్గు సిగ్గు. ఒక ప్రజానాయకునివై ఉండి.. స్త్రీలపై నీ అభిప్రాయం ఇదా. నీ నీ ఇంట్లో ఆడోళ్లే నీ ముఖంపై ఉమ్మేయాలి. అప్పుడే నీకు బుద్దొస్తుంది’ అని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. సుధీర్ స్పందన చూశాక అయినా.. ఈ సినిమా వాళ్లకు చలనం వస్తుందంటారా?