గోపిచంద్ 'జిల్' 'జిల్'
on Oct 16, 2014
టాలీవుడ్ లో కొంతకాలంగా కష్టకాలాన్ని ఎదుర్కొన్న గోపిచంద్ 'లౌక్యం'తో ఒక్కసారిగా ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తి హిట్ కొట్టాడు. లేటెస్ట్ గా అభిమానులను 'జిల్' అనిపించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. గోపీచంద్ కథానాయకుడిగా యువి క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తో౦ది. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 70 శాతం పూర్తయింది. ఏంతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సాగిపోయే ఈ సినిమాకి 'జిల్' అనే పేరును పరిశీలిస్తున్నారట. 'ఊహలు గుసగుసలాడే' ఫేం రాశీ ఖన్నా కథానాయికిగా నటిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ ఏలేటి శిష్యడు రాధాకృష్ణ డైరెక్టర్. 2015 జనవరిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.