హృతిక్ రోషన్ ఆఫీసులో అగ్నిప్రమాదం
on Jul 18, 2014
.jpg)
ముంబాయిలోని రితిక్ రోషన్ ఆఫీసులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముంబాయి, లోకండ్ వాలా లింక్ రోడ్ లో గల లోటస్ బిజినెస్ పార్క్లో అగ్నిప్రమాదం చోటుచేసుంది. 21 అంతస్తులో చెలరేగిన మంటలు వెనువెంటనే 20 అంతస్తుకి వ్యాపించాయి. ఈ భవన సముదాయంలో బాలీవుడ్ తారలు అనేక మంది బిజినెస్ కార్యాలయాలు కలవు. రితిక్ రోషన్, అజయ్ దేవగన్ తో పాటు మరికొంత మంది ప్రముఖుల ఆఫీసుల గల ఈ భవనాన్ని వెంటనే ఖాళీ చేయించారు.
ప్రమాద విషయం తెలియగానే 12 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు హెలికాప్టర్ ని వినియోగించారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ఈ సంఘటలో ఒకరు మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



