మరోసారి `జాతిరత్నాలు` జోడీ!?
on Jan 22, 2022
గత ఏడాది మార్చి సెన్సేషన్ `జాతిరత్నాలు`లో జంటగా నటించి ఎంటర్టైన్ చేశారు నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్దుల్లా. కట్ చేస్తే.. త్వరలో ఈ ఇద్దరు మరోమారు జట్టుకట్టబోతున్నారని టాలీవుడ్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`, `జాతిరత్నాలు` వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తరువాత నవీన్ పోలిశెట్టి.. రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో స్టార్ బ్యూటీ అనుష్కతో కలిసి నటించబోతున్న చిత్రం కాగా.. మరొకటి సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై `అనగనగా ఒక రాజు` పేరుతో తెరకెక్కుతున్న సినిమా. కాగా, కళ్యాణ్ శంకర్ అనే నూతన దర్శకుడు రూపొందించనున్న `అనగనగా ఒక రాజు`లో `జాతిరత్నాలు` భామ ఫరియా అబ్దుల్లా కూడా సందడి చేయనుందట. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి.. `జాతిరత్నాలు` జోడీ మరోసారి సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.
ఇదిలా ఉంటే.. `జాతిరత్నాలు` తరువాత ఫరియా అబ్దుల్లా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`, `బంగార్రాజు` చిత్రాల్లో అతిథిగా మెరిసింది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ సరసన `రావణాసుర` సినిమాలో ఓ హీరోయిన్ గా నటిస్తోందీ టాలెంటెడ్ బ్యూటీ.