హరికృష్ణ రేర్ ఫోటోను షేర్ చేసిన క్రిష్..!!
on Aug 29, 2018
ఎన్టీఆర్ కుమారుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ ఈరోజు రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.. ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.. డైరెక్టర్ క్రిష్ మాత్రం ఒక అరుదైన ఫోటోని షేర్ చేసి హరికృష్ణకి సంతాపం తెలిపారు.. 1962 లో నేషనల్ డిఫెన్సె ఫండ్ యాక్టీవిటీ సందర్భంగా హరికృష్ణ, ఎన్టీఆర్ ముందుండి నడుస్తున్న ఫోటోను క్రిష్ షేర్ చేసారు.
అంతేకాదు ఆ ఫొటోకు ఆయన అద్భుతమైన వ్యాఖ్యలు కూడా జోడించారు.. 'మార్పుకోసం రామ రధ చక్రాలు నడిపిన చైతన్యరధసారధ్యం.. చిన్ననాటే జనం కోసం తండ్రి ముందు నడచిన వారసత్వం' అంటూ హరికృష్ణ గురించి కొనియాడారు.. క్రిష్ పోస్ట్ చేసిన ఆ రేర్ ఫోటో మరియు ఆ వ్యాఖ్యలు ఆకట్టుకుంటున్నాయి.. ప్రస్తుతం క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ కి దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.. ఈ బయోపిక్లో హరికృష్ణ పాత్రకు కూడా బాగా ప్రాముఖ్యత ఉంది.. కాగా, హరికృష్ణ పాత్రలో ఆయన కుమారుడు నందమూరి కళ్యాణ్ రామ్ నటించనుండటం విశేషం.