ప్లాప్ ఇచ్చిన దర్శకుడుకి బంపర్ ఆఫర్ ఇస్తున్న అగ్ర హీరో
on Mar 19, 2024
ఒక హీరో, డైరెక్టర్ కాంబినేషన్ లో హిట్ వచ్చిందంటే మళ్ళీ ఆ ఇద్దరి కాంబో తెరకెక్కడానికి చాలా టైం పడుతుంది.అదే ప్లాప్ వస్తే మాత్రం అసలు సినిమా రావడమే కష్టం. ఒక వేళ వచ్చినా కూడా చాలా టైం పడుతుంది. అలాంటిది ఒక హీరో పైగా అగ్ర హీరో తనకి ప్లాప్ ఇచ్చిన డైరెక్టరే కావాలని అంటున్నాడు. ఆ హీరో ఎవరో చూద్దాం.
ధనుష్..తమిళ అగ్ర హీరోల్లో ఒకడు. తెలుగులో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ధనుష్ ఒప్పుకున్నకొత్త సినిమాల లిస్ట్ లో ఇళయరాజా బయోపిక్ కూడా ఉంది. ఈ మూవీకి అరుణ్ మాతేశ్వరన్ ని దర్శకుడుగా ధనుష్ ఎంచున్నాడనే వార్త తమిళ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. ఆ ఇద్దరి కాంబోలో మొన్నీ ఈ మధ్యనే కెప్టెన్ మిల్లర్ వచ్చింది. తెలుగులో కూడా అదే పేరుతో విడుదల అయ్యి రెండు చోట్ల పరాజయం పాలయ్యింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ధనుష్ తన నూతన చిత్రానికి అరుణ్ ని ఎంచుకోవడం చర్చినీయాంశమయ్యింది. మరికొన్ని రోజుల్లో ఇందుకు సంబంధించి అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు.
అంతకు ముందు బాలి ని దర్శకుడు గా తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. ఆల్రెడీ ధనుష్ బాలి కాంబోలో హిందీలో షమితాబ్ అనే చిత్రం తెరకెక్కింది. అమితాబచ్చన్ కూడా అందులో నటించాడు.మూవీ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక అరుణ్ మాతేశ్వరన్ 2021 లో రాకీ చిత్రంతో దర్శకుడుగా పరిచయమయ్యాడు. అంతకు ముందు డైలాగ్ రైటర్ గా కూడా పని చేసాడు.
Also Read