చార్మీనార్ ముందు బండి డ్రైవ్ చేస్తున్న పరిణీతి
on Jul 8, 2014
అవునూ, నిజమే. చార్మీనార్ ముందే కాదు, టాంక్ బండ్ మీద కూడా బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా బండి నడుపుతూ కనిపించింది. అయితే అది తన తాజా చిత్రం దావత్ ఏ ఇష్క్ సినిమా ట్రెయిలర్ లో. ఈ సినిమాలో పరిణీతి హైదరాబాదీ అమ్మాయిగా , ఆషికీ-2 ఫేం ఆదిత్య రాయ్ కపూర్ లక్నో అబ్బాయిగా కనిపించబోతున్నారు.
ఈ చిత్రం కోసం హైదరాబాదులో సెట్ కూడా నిర్మించారు. హైదారాబాద్ లోని గోల్కొండా, సిటీ కాలేజ్ తో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హబీబ్ ఫజల్ డైరెక్ట్ చేస్తుండగా, ఆదిత్య చోప్రా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ట్రెయిలర్ తోనే ఊరిస్తున్న ఈ దావత్ ఏ ఇష్క్ సినిమా సెప్టెంబర్ 5 న విడుదల కానుంది.