తెలుగు సినిమాకి సరికొత్త పండుగ.. మళ్ళీ కొత్తగా పుట్టినట్టే అనుకోవచ్చా!
on Aug 21, 2025

గత పద్దెనిమిది రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన పలు శాఖల కార్మికులు తమ వేతనాలని పెంచాలని సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో సెట్స్ పై ఉన్న పలు చిత్రాల షూటింగ్ లు ఆగిపోయాయి. ఈ విషయంలో కార్మికుల ఆధ్వర్యంలోని సినీ ఫెడరేషన్, నిర్మాత మండలి మధ్య జరుగుతున్న చర్చలు విఫలమవుతు వస్తున్నాయి. చిరంజీవి(Chiranjeevi),బాలకృష్ణ(Balakrishna) కూడా ఈ విషయంపై ఇరువైపుల యూనియన్స్ తో మాట్లాడుతున్నారు.
ఇక ఫెడరేషన్, నిర్మాతల మధ్య ఉన్న సమస్యకి త్వరగా పరిష్కారం చూపాలని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ప్రత్యేక చొరవ చూపారు. దీంతో రీసెంట్ గా మరోసారి చర్చలు జరుగగా విజయవంతమవ్వడంతో, ఈ రోజు నుంచి షూటింగ్స్ యధావిధిగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు(Dil Raju)సిఎం కి కృతజ్ఞత లు తెలిపారు.
ఫెడరేషన్ మొదటి నుంచి అడుగుతున్న 30 % శాలరీ పెంపులో, మొదటి ఏడాది 15 శాతం,రెండో ఏడాది 2.5 శాతం,మూడో ఏడాది 5 శాతం చొప్పున మొత్తం 22.5 శాతం వేతనాలు పెరగనున్నాయి. ఫెడరేషన్ అడిగిన మరికొన్ని సమస్యలకి కూడా సానుకూల స్పందన రావడం జరిగింది. ఇక చిత్ర పరిశ్రమలో మళ్ళీ షూటింగ్ ల హడావిడితో పండుగ వాతావరణం ఏర్పడినట్టే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



