'RRR'లో బిగ్ మిస్టేక్.. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్!
on May 26, 2022
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. మార్చి 25న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలన విజయాన్ని అందుకుంది. మే 20 నుంచి ఈ సినిమా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో వచ్చినట్లే ఓటీటీలోనూ ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే స్థాయిలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి.
సినిమాలోని మిస్టేక్స్ థియేటర్ కంటే ఓటీటీలో ఎక్కువగా పట్టేయొచ్చు. 'ఆర్ఆర్ఆర్'లో ఓ బిగ్ మిస్టేక్ ని కూడా కొందరు అలాగే పట్టేశారు. సినిమాకే హైలైట్ గా నిలిచిన ఇంటర్వెల్ సీన్ లో ఈ మిస్టేక్ ఉండటం విశేషం. భీమ్(తారక్) ఒక వాహనంలో అడవి జంతువులను తీసుకెళ్లి బ్రిటీష్ కోటపై దాడి చేస్తాడు. ఈ సీన్ కి థియేటర్స్ లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులకు గూజ్ బంప్స్ తెప్పించేలా ఈ సీన్ ని అద్భుతంగా తెరకెక్కించారు. అయితే ఈ సీన్ లో ఓ బిగ్ మిస్టేక్ ఉంది. ఒకే బోనులో రెండు పులుల్ని, రెండు జింకల్ని ఉంచారు. జింక పులి కంటపడితే ఏమైనా ఉందా?.. వెంటాడి వేటాడి మరీ తినేస్తుంది. అలాంటిది పక్కనే జింకలున్నా పులులు నాన్ వెజ్ మానేసినట్లు ఏం చేయకుండా అలా ఉండటం ఏంటి? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు జక్కన్న? అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ దర్శనమిస్తున్నాయి.
రాజమౌళి ప్రతి సన్నివేశం విషయంలోనూ చాలా శ్రద్ధ తీసుకుంటాడు. అలాంటిది ఈ సన్నివేశంలో ఉన్న మిస్టేక్ ని గమనించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
Also Read