ENGLISH | TELUGU  

ఖాన్స్ పై మురుగదాస్ కీలక వ్యాఖ్యలు

on Aug 19, 2025

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ప్రముఖ తమిళ దర్శకుడు 'ఏఆర్ మురుగదాస్'(Ar Murugadoss)కి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తెరకెక్కించిన చాలా చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ ఏడాది మార్చి 28 న మురుగదాస్ దర్శకత్వంలో 'సికందర్'(Sikandar)మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan),రష్మిక(Rashmika Mandanna)జంటగా నటించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం  దారుణమైన పరాజయాన్ని అందుకుంది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలని మరో స్టార్ హీరో 'శివకార్తికేయన్' తో  'మదరాసి'(Madharaasi)అనే  చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సెప్టెంబర్ 5 న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.
    
ఇందుకు సంబంధించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో 'మురుగదాస్' మాట్లాడుతు ఎనిమిది సంవత్సరాల క్రితమే 'మదరాసి' కథ లైన్ ని 'షారుక్ ఖాన్'(Shah Rukh Khan)కి చెప్తే ఆయనకి బాగా నచ్చింది. పూర్తి స్క్రిప్ట్  రెడీ కాకపోవడంతో హీరో క్యారక్టర్ గురించి తక్కువగా చెప్పాను. స్క్రిప్ట్ సిద్ధమయ్యాక, రెండు వారాల తర్వాత  మెసేజ్ చేశాను, కానీ షారుఖ్ నుంచి రిప్లై రాలేదు. ఆ తర్వాత షారుక్ ఎప్పుడు సంప్రదించలేదు. దీంతో   శివకార్తికేయన్ తో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాను.
 
సికందర్ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం రాత్రి వేళల్లోనే జరిగేది. డే ఎఫెక్ట్స్ సీన్స్ ని కూడా, నైట్ చిత్రీకరించేవాళ్ళం. సల్మాన్ రాత్రి ఎనిమిది గంటలకి షూట్ కి వచ్చే వాళ్ళు. స్టార్ హీరోలతో షూటింగ్ అంటే అనుకున్న ప్రకారం జరగవు .దీంతో సికందర్ లో ఎన్నో భావోద్వేగ అంశాలు ఉన్నప్పటికీ అనుకున్న విధంగా తెరకెక్కించలేకపోయానని మురుగదాస్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మాటలు సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.