సైలెంట్ గా వస్తున్న అనుష్క
on Aug 27, 2018
ఈ తరం హీరోయిన్లలో అనుష్క శైలి భిన్నం.. కథల్లో, పాత్రల్లో వైవిధ్యం చూపిస్తూ ఉంటుంది.. అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి లాంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క త్వరలో మరో విభిన్న చిత్రం చేయబోతున్నట్టు తెలుస్తోంది.. 'వస్తాడు నా రాజు’ ఫేం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఓ సైలెంట్ థ్రిల్లర్ తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది.. ఈ సినిమాలో మాధవన్, అనుష్క నటించనున్నారని సమాచారం.. ఈ సినిమాకు ‘సైలెంట్’ అనే టైటిల్ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.. కాగా ఈ సినిమాకు కోన వెంకట్ కథ అందించారని సమాచారం.. బాహుబలి, భాగమతి తరువాత వెండితెరను పలకరించని అనుష్క సైలెంట్ గా వచ్చి అలరిస్తుందేమో చూడాలి మరి.